Rashmika mandanna: సుకుమార్ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఇప్పటికే చాలామంది చెప్పుకుంటుంటారు. అంతేకాదు తన యునిట్ సభ్యులలో కూడా చాలామందికి కథ తెలీదనేది కూడా ఓ టాక్. ఇద్దరు లేదా ముగ్గురుకు మాత్రమే సుక్కూ కథ నరేట్ చేస్తాడట. ఇక ఆయన బెటర్మెంట్ కోసం షూటింగ్ సమయంలోనూ సీన్స్ మార్చడం..అవసరమైతే కథను కాస్త మార్చడం చేస్తుంటాడు. అది ఆయనకు ముందు నుంచీ ఉన్న అలవాటే. అంటే సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక ఛేంజెస్ చేస్తూనే ఉంటాడు.
అందుకే కథ మీద పూర్తిగా ఎవరికీ ఓ అవగాహన ఉండదు. మరోసారి ఇదే విషయాన్ని తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న కూడా చెప్పుకొచ్చింది. పుష్ప సినిమా కథేంటో తెలీకుండానే నటించాననడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. డిసెంబర్ 17న పుష్ప: ది రైజ్ పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
Rashmika mandanna: కాస్త కథ నాకు అర్థమైంది అంటే డబ్బింగ్ చెప్పినప్పుడే.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ సుకుమార్ సార్ నాకు కథ చెప్పలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు కాస్త కథ నాకు అర్థమైంది అంటే డబ్బింగ్ చెప్పినప్పుడే. డబ్బింగ్ చెప్పిన సమయంలో ఈ సినిమా మిస్ అయి ఉంటే ఓ మంచి హిట్ కోల్పోయేదాన్ని అని తెలిపింది. ఇక ఈ సినిమా కోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకున్న రష్మిక మొదటిసారి కంప్లీట్ డీగ్లామర్ రోల్లో కనిపించబోతోంది. ఇంతకాలం స్టైలిష్గా నటించిన అల్లు అర్జున్ ఊరమాస్ గెటప్లో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్గా కనిపించబోతున్నాడు. భారీ
అంచనాలున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. చూడాలి మరి పుష్ప ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో.