ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ – రష్మిక మందన్నా కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ భారీ పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. అందుకే మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ తో పాటు విలన్ గా నటించే ప్రధాన పాత్రని సుకుమార్ ఫైనల్ చేయాల్సి ఉంది.
కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా చిత్రీకరణ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. ముఖ్యంగా కేరళ లో అనుకున్న భారీ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఆ షెడ్యూల్ కోసం చాలా ప్రయత్నించారు. కాని తిరిగి ఈ షెడ్యూల్ మళ్ళీ కేరళ లోనే ప్లాన్ చేశారు.
అయితే డిసెంబర్ లో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు మార్చినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం నవంబర్ నుంచే కేరళ అడవుల్లో షూటింగ్ ప్రారంభం కాబోతుందట. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే అధ్బుతమైన ట్యూన్స్ రెడీ అయినట్టు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం ఇటలీలో షూటింగ్ జరుపుతున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా నవంబర్ నుంచి ఫారిన్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు మేకర్స్.