త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో ఎవరి అంచనాలకి అందకుండా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. ఈ ఉత్సాహంలో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ ఇండియా సినిమాలో నటించడానికి కమిటయ్యాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా సుకుమార్, అల్లు అర్జున్ కి లక్కి మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
అయితే పుష్ప మొదలైనప్పటి నుంచి అనుకోని విధంగా అవాంతరాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలో సెకండ్ లీడ్ లో నటించే హీరోయిన్ తో పాటు మేయిన్ విలన్ గా నటించే వాళ్ళు ఫైనల్ కాలేదన్న టాక్ ఉంది. అదీ కాక లాక్ డౌన్ కి ముందు ప్లాన్ చేసిన కేరళ షెడ్యూల్ తో కొంత ఆర్ధిక నష్టం కూడా జరిగింది. ఇవన్ని సహజం గా ఒక భారీ సినిమా విడుదలయ్యాక జరిగేవే. కాని జనాలలో కొంతమంది యాంటి ఫ్యాన్స్ మాత్రం పని కట్టుకొని వీటి గురించే చర్చలు జరుపుతుంటారు.
కాగా ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యామ్, నాని టక్ జగదీష్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, నాగార్జున వైల్డ్ డాగ్ సహా చాలా సినిమాలు సెట్స్ మీదకి వచ్చేశాయి. దాంతో పుష్ప ఎప్పుడు మొదలవుతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారట కొందరు. అంతేకాదు 2021 సంక్రాంతి బరిలో దిగుతుందని అనుకున్నామని కాని సుకుమార్ చాలా లేట్ అవుతున్నాడని మాట్లాడుకుంటున్నారట. అయితే 7 నెలలుగా కరోనా కారణంగా ఏ సినిమా షూటింగ్ జరగలేదన్న సంగతి తెలిసిందే.
సుకుమార్ లెక్క ప్రకారం నిజంగానే 2021 సంక్రాంతి బరిలో కంటే ముందే పుష్ప రిలీజ్ అయి ఉండేది. 7 నెలల సమయం అంటే సుకుమార్ లాంటి లెక్క తెలిసిన వాళ్ళకి సరిపోయే సమయమే. కాని పరిస్థితులన్ని తారుమారయ్యాయి. కాబట్టే ఈ సినిమా ఎప్పుడు కంప్లీటవుతుందో ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. కనీసం సగానికి పైగా చిత్రీకరణ జరిగి ఉంటే అయినా ఒక క్లారిటీ ఉండేది. అలా కానప్పుడు ఏ దర్శకుడు ఏదో ఒకటి చెప్పేసి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడు కదా. ఈ విషయం కొంతమందికి అర్థం కావడం లేదు అంతే.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!