Sundar Pichai on Diwali: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడం, శ్రీరాముడు రావణుడిని చంపేయడం అనే రెండు పురాణ సంఘటనల వల్లే దీపావళి జరుపుకోవడం ప్రజలు ప్రారంభించారని నమ్ముతారు. అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఏటా ఓన్లీ పురాణాల ప్రకారమే విజయానికి ప్రతీకగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఈసారి మాత్రం చాలా మంది ప్రజలు దీపావళిని టీమిండియా విజయానికి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ జాబితాలోకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేరిపోయారు.
Sundar Pichai on Diwali: అలా సెలబ్రేట్ చేసుకున్న పిచాయ్
నిన్న అంటే ఆదివారం నాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 90,293 మంది ప్రేక్షకుల సమక్షంలో భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ఒక థ్రిల్లర్ మూవీని తలపించింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో ఆఖరి బంతిలో పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని సాధించాడు. విరాట్ కోహ్లీ ఇండియాకి అలా దీపావళి గిఫ్ట్ అభిమానులకు అందించాడు. దాంతో నేడు చాలామంది ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే రోజు దీపావళి కావడంతో దేశమంతటా సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ ఈరోజు కూడా మళ్లీ మళ్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఈ మ్యాచ్ మళ్లీ చూసి ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.
లాస్ట్ త్రీ ఓవర్స్తో సెలబ్రేషన్స్
క్రికెట్లో లవర్ అయిన సుందర్ పిచాయ్ ఈరోజు మ్యాచ్లోని లాస్ట్ త్రీ ఓవర్స్ చూసి ఎంజాయ్ చేశారు. “అందరికీ దీపావళి శుభాకాంక్షలు! ఈ పర్వదినాన్ని జరుపుకునే ప్రతి ఒక్కరూ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొప్ప సమయాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మళ్లీ చివరి మూడు ఓవర్లు చూసి సంబరాలు చేసుకున్నాను. వాట్ ఏ గేమ్ అండ్ పెర్ఫార్మన్స్” అని ఒక ట్వీట్ చేశారు. అయితే టీమిండియా మొదటి మూడు ఓవర్లలో పాక్ బౌలర్ల దాటికి తట్టుకోలేక రెండు వికెట్లు కోల్పోయింది. కాగా ఒక ట్రోలర్.. “మీరు ఫస్ట్ త్రీ ఓవర్లు కూడా చూసి ఉండాల్సింది” అంటూ వెటకారంగా పిచాయ్కి రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇచ్చిన వ్యక్తి చెంప చెల్లుమనిపించేలా.. “అవును అది కూడా చూసా. భువీ, అర్ష్దీప్ బౌలర్స్ కూడా అద్భుతంగా రాణించారు” అని పేర్కొన్నారు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ గురించి కాకుండా పిచాయ్ పాకిస్థాన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడి బుద్ధి చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్గా మారాయి.