విశాఖపట్నం స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు 2020 కు పోటీలో నిలిచింది. విశాఖ నగరం మామూలుగానే స్వచ్ఛతకు మారుపేరు. ఆంధ్రరాష్ట్రంలో అంతటి స్వచ్ఛమైన నగరం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక ఈ నగరం తాజాగా ప్రధానమంత్రి అవార్డు కోసం ఎంపిక చేసిన పది జిల్లాల్లో చోటు దక్కించుకుంది. దక్షిణాది రాష్ట్రాల తరఫున ఎంపికైన ఏకైక జిల్లా విశాఖ నిలవడం గమనార్హం.
ఒక విశాఖ మహా నగరంలోనే కాకుండా చుట్టూ పక్కల గ్రామాలు పట్టణాలు కూడా అంతే స్వచ్ఛతను కలిగి ఉండడం నిజంగా అరుదైన విషయం. ఇక విశాఖ జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల కలిపి ఒక క్లస్టర్ గా పోటీలో పాల్గొన్నాయి. స్వచ్ఛ సర్వేక్షన్ లో ఈ సంవత్సరం 14 స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచిన విశాఖను రాజధానిగా చేద్దామని జగన్ ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ దశలో జగన్ కు ఈ అవార్డుకి విశాఖ ఎంపిక కావడం అనేది చాలా ఊరటనిచ్చే విషయం.
అంతేకాకుండా ఈ పోటీలో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత, స్థానిక సంస్థల సేవలు ప్రజలకు కల్పించే అవగాహనా కార్యక్రమాలు, వ్యక్తిగత పరిశుభ్రత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం మొదలైన అంశాలలో ప్రజల్లో అవగాహన భాగస్వామ్యం ఎలా ఉంది అన్న విషయం పై పోటీ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు కలిపి జిల్లా యుఎల్ బి క్లస్టర్ గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీలో నిలిచింది.
ఇక ప్రజల భాగస్వామ్యం మీద అవార్డు వచ్చేది లేనిది తెలుస్తుంది. అయితే జగన్ మాత్రం ఈ డెవలప్మెంట్ తో ఫుల్ ఖుషి అయిపోయాడు. ఎలాగైనా విశాఖ లో రాజధాని శంకుస్థాపన చేయాలన్న తపన, తృష్ణ మరింత పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.