Breaking: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేంగగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్న వారు కరోనా బారిన పడుతున్నారు. ప్రముఖ సినీనటులు వరుసగా కరోనా బారిన పడుతుండంటో కలవరాన్ని కల్గిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డాననీ, చిన్న చిన్న లక్షణాలు ఉన్నాయనీ, వైద్యుల సూచనలతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కల్సిన వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాననీ, త్వరలో తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తునట్లు మహేష్ బాబు తెలిపారు. మహేష్ బాబు కొన్ని రోజులుగా దుబాయ్ లో కుటుంబంతో పాటు ఉన్నారు. ఇటీవలే స్పెయిన్ లో మహేష్ బాబు కాలికి సర్జరీ జరిగింది.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022