అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతితో సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం ఇంట్లో వైఎస్ భారతిని నమ్రత శిరోద్కర్ కలిశారు. తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో మహేష్ బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్ వివరాలు వైఎస్ భారతికి నమ్రత వివరించారు. ప్రభుత్వం నుంచి బుర్రిపాలెం గ్రామం కోసం సహకారం అందించాలని వైఎస్ భారతిని నమ్రత కోరారు. సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. కొత్తగా కొన్నింటికి శ్రీకారం చుట్టారు. ఈ గ్రామ అభివృద్ధి బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు.
previous post
next post