సూపర్ స్టార్ రాజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. తీవ్రమైన రక్తపోటు (హైబీపీ) కారణంగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో జూబ్లిహిల్స్లోని అపోలో హాస్పటల్కు తరలించారు. ఆయన వెంట కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో నూతన పార్టీ ప్రకటన చేయనున్న సమయంలో రజనీ తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళన చెందుతున్నారు.
రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ కారణంగా పది రోజులుగా రజనీకాంత్ హైదరాబాద్ లో ఉన్నారు. అయితే షూటింగ్ సందర్భంగా కరోనా టెస్ట్ లు చేయగా పలువురు షూటింగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో షూటింగ్ కార్యక్రమాలు రద్దు అయినట్లు తెలుస్తుంది. రజనీకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిందని అంటున్నారు. హైబీపీ తోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
కాగా గతంలో బాబా షూటింగ్ సమయంలోనూ రజనీ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. తరువాత వైద్య చికిత్సల అనంతరం కోలుకున్నారు.