హీరోగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజ్ అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర హోస్ట్ గా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన తారక్ మరోసారి టెలివిజన్ షో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరోసారి క్రితంసారి కన్నా ఎక్కువ స్థాయిలో అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతానికి బిగ్ బాస్ షో కాకుండా ఏదైనా టాక్ షో చేస్తే బాగుంటుందని అనుకున్నారట. మొదటి సీజన్ బిగ్ బాస్ సూపర్ హిట్ అందులో ఎన్టీఆర్ అంటే తెగ నచ్చేశాడు అతని స్థాయిని అందుకోవడానికి తర్వాత నాని నాగార్జున ఇప్పటికీ కష్టపడుతున్నారు అని చాలామంది అంటుంటారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ తర్వాత సీజన్లకు హోస్ట్ గా చేయలేదు.
ఇక ప్రస్తుతం జెమినీ టీవీ వాళ్ళు ఒక ఏడాది నుండి విషయమై ఎన్టీఆర్ వెనుక పడుతున్నట్లు తెలుస్తఎంట్టై ఎంటర్టైన్మెంట్ విషయంలో జీ తెలుగు, మాటీవీ, ఈ టీవీ లతో పోలిస్తే జెమిని చాలా వెనుకబడి ఉంది అన్న విషయం తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ లాంటి స్టార్ నటులతో నిర్వహిస్తే మళ్లీ తమ పూర్వ వైభవం దక్కుతుందని వారి ఆశ గా చెప్పవచ్చు. ఇక చివరికి ఎన్టీఆర్ రెడీ చేసుకోమని చెప్పగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏకంగా 2 ఫ్లోర్స్ వారు బుక్ చేసినట్లు పక్కా సమాచారం బయటికి వచ్చింది.
పెద్ద సెట్ నిర్మించేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలను చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్ దీనిని ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ ఈ శని ఆది వారాల్లో రెండు గంటల సమయాన్ని వారికి కేటాయిస్తే చాలట. షో ను కొనసాగిస్తూనే షూటింగ్ లు కూడా హ్యాపీగా చేసుకోవచ్చని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.