ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా ఏపి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
గత టీడీపీ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న అబియోగంపై ఏపి వెంకటేశ్వరరావును జగన్మోహనరెడ్డి సర్కార్ సస్పెండ్ చేసింది. అయితే దీనిపై ఎబి వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అక్రమమంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఏపి ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ రద్దు చేయగా కొట్టివేసింది. అనంతరం ఏబి వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై గురువారం సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.