మారటోరియం గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అపి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ మార్చి 2021 వరకు మారటోరియంను కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.
అందుకు స్పందించిన న్యాయస్థానం.. అదేవిధంగా చెల్లించని ఈఎంఐ లపై ఎలాంటి అదనపు వడ్డీ కానీ పెనాల్టీ విధించకూడదు అని ఆదేశించింది. ఇకపై ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఆగస్టు 31 తో ముగిసిపోయిన మారటోరియం ను పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడిగించాలని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇలా మారటోరియం పొడిగించడం ఎటువంటి అదనపు చార్జీలు, వడ్డీలు లేకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకు ఆనందాన్నిచ్చే అంశం.