మహామ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నువుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దేశ వ్యాప్తంగా తన పై నమోదు అయిన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలనీ, తనను పోలీసులు అరెస్టు చేయకుండా నిలువరించాలని కోరుతూ నుపూర్ శర్మ రెండవ సారి నిన్న సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. నుపూర్ శర్మ తరపున న్యాయవాది మహిందర్ సింగ్ వాదనలు వినిపించారు. నుపుర్ శర్మకు ప్రాణహాని కూడా ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నుపుర్ శర్మపై దాఖలైన కేసుల్లో ఆగస్టు 10వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతకు ముందు నుపూర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించడంతో పాటు ఆమెపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యల వల్ల దేశం రావణకాష్టంగా తయారైందనీ, ఈ మొత్తాన్ని ఆమెదే బాధ్యత అని, మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. కేసులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించాలని చెప్పింది. అయితే ఆ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు. సువుర్ శర్మ పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాయడం తీవ్ర సంచలనం కల్గించింది. ఈ నేపథ్యంలో సుపుర్ శర్మ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ధర్మాసనం మథ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ ఎమ్మెల్యేలకు గుడ్, బ్యాడ్ న్యూస్లను చెప్పిన సీఎం వైఎస్ జగన్