(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గుంటూరు జిల్లా తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చాలని సుప్రీం కోర్టు నేడు ఏపి హైకోర్టును ఆదేశించింది. వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే మూడు వారాల తరువాత పరిష్కరిస్తామని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
తుళ్లూరు తహశీల్దార్ సుధీర్బాబు సహా పలువురిపై భూకుంభకోణాని పాల్పడ్డారంటూ ఏపి సీఐడీ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో సుధీర్బాబు ఏపి హైకోర్టును ఆశ్రయించగా సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం..సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు..హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తేయడానికి నిరాకరిస్తూ ఈ అంశంపై విచారణ వారం లోగా ముగించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలోనే చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలనీ, దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక మార్పు చేబుతూనే ఉన్నామని, హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.