అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఇవేళ విచారణ జరిపే అవకాశం ఉంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, దీనికి వ్యతిరేకంగా రైతులు దాఖలు కేవియట్ పిటిషన్లు, మూడు రాజధానులను సమర్దిస్తూ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు శుక్రవారం జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ కేసుల జాబితాలో రిజిస్ట్రీ చేర్చింది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 2013, 2014 లో రాష్ట్ర విభజనను, రాష్ట్ర విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు, విభజన చట్టం హామీలు అమలుపై పొంగులేటి సుధాకరరెడ్డి వేసిన పిటిషన్ల ను జత చేసింది రిజిస్ట్రీ. ఇవన్నీ కలిపి 36 వరకు ఉన్నాయి. దీంతో రాజదాని పిటిషన్లను రాష్ట్ర విభజన పిటిషన్ల నుండి వేరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి రైతులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు.
అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, రైతుల పిటిషన్లు ఈ నెల 1వ తేదీ విచారణకు రాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం నుండి తప్పుకుని వేరే బెంచ్ కు విచారణకు పంపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ల పై సుప్రీం ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది దానిపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
కేటిఆర్ చెప్పినట్లు పాన్ ఇండియా మువీ చూపించిన సీఎం కేసిఆర్.. బీజేపీపై చాలా ఘాటుగా
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?