Supreme court: సాధరణంగా ఆడపిల్లకు పెళ్లి అయితే అమ్మ నాన్నలను వదిలి అత్తవారి ఇంటికి వెళ్తుంది కదా. అయితే కొంతమంది అత్తలు అమ్మాయి పెళ్లి అయినా సరే అల్లుడి ఇంటిలో నివాసం ఉంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి అత్తలకు కూడా పరిహారం అందుతుందట. ఏదైనా ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు లేదంటే తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. ఈ క్రమంలోనే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా ఇకమీదట నష్టపరిహారం పొందేందుకు హక్కు ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
Supreme Court: సీబీఐపై జస్టిస్ ఎన్వీ రమణ ఉగ్రరూపం..! తీవ్ర ఆగ్రహం..! సీబీఐ డైరెక్టర్ కు నోటీసులు..?
అత్త కుడా చట్ట భద్ర ప్రతినిధే:
మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఇకమీదట అత్త కూడా అర్హురాలే అవుతుందని తేల్చి చెప్పింది. అసలు వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ యాక్సిడెంట్ తరువాత ఆయన కుటుంబానికి రూ. 7,450,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి అని బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728 కి తగ్గించి, వారితో పాటు ఉండే అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఆ తరువాత చనిపోయిన వ్యక్తి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
supreme Court: సీబీఐకి సుప్రీం కోర్టు అక్షింతలు..!!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్నాడు. కానీ 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని కాబట్టి కుటుకబ సభ్యులకు రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అల్లుడి పై ఆధారపడి అతని ఇంట్లోనే ఉంటున్న అత్త కూడా పరిహారం పొందేందుకు అర్హురాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం అల్లుడికి ఆమె చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టివేసింది.
Supreme Court: ఇ – కామర్స్ దిగ్గజాలు ఫ్లిక్ కార్టు, అమెజాన్లకు సుప్రీంలోనూ చుక్కెదురు..