ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరసగా సుప్రీమ్ కోర్టు నుండి షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. జగన్ సర్కార్ ఆంగ్ల మాధ్యమ బోధనను తప్పనిసరి చేస్తూ జీవోలు 81, 85 జారీ చేసిన విషయం తెల్సిందే.
అయితే ఆ తర్వాత ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోల రద్దు విషయంలో జగన్ సర్కార్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చింది. కాగా తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు సుప్రీమ్ కోర్టు వాయిదా వేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనను తప్పనిసరి చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు కేవియట్ దాఖలు చేసారు. రెండు వారాల్లో అపిడవిట్ దాఖలు చేయాలని వారికి సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?