Supreme Court : ఫోర్జరీ అభియోగాలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రవిప్రకాష్ టీవీ 9 ఛానల్ కు సీఈఓగా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ నూతన యాజమాన్యం ఫిర్యాదు చేసింది. 2018 -19 మధ్య సుమారు రూ.18 కోట్లు బ్యాంకు నుండి విత్ డ్రా చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఆ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్న సుప్రీం కోర్టు బెయిల్ నిబంధనలు రవిప్రకాష్ అతిక్రమించాడా అని ఈడీ ని ప్రశ్నించింది.