అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్ను సీజ్ చేయాలని హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని
కంపెనీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.
హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనల నైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.