ఏపి విభజన, అమరావతి రాజధాని పిటిషన్ల పై విడివిడిగానే విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన, రాజధాని అమరావతికి సంబందించి మొత్తం 36 పిటిషన్లు జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ రుషికేశ్ రాయ్ ల నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రాగా రాజధాని, రాష్ట్ర విభజన కేసులను రెండు వేటికవే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ, మాజీ అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టులో రైతులు కోర్టు దిక్కరణ పిటిషన్లు వేశారని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా .. సుప్రీం కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకూ హైకోర్టులో కోర్టు దిక్కరణ పిటిషన్ల పై రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని ధర్మాసనం అబిప్రాయపడింది.
రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రభుత్వం తరపు న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనానికి వివరించి హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలా వద్దా అన్న విషయంపై తదుపరి విచారణలోనే దృష్టి పెడతామని పేర్కొన్న ధర్మాసనం .. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.కాగా రాజధాని అమరావతిపై 8 పిటిషన్లు దాఖలై ఉండగా, రాష్ట్ర విభజనపై ఏకంగా 28 పిటిషన్లు విచారణలో ఉన్నాయి.
G20 Summit: జీ 20 సమ్మిట్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పయనం