ఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్వ చ్ఛంద సంస్థలైన సెంటర్ ఫర్ పిఐఎల్ (సిపిఐఎల్), కామన్కాజ్, స్వరాజ్ అభియాన్ల గవర్నింగ్ బోర్డులకు రాజీనామా చేశారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వృత్తి ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు తాము సభ్యులుగా ఉన్న సంస్థల తరఫున వాదించడానికి వీల్లేదు.
సిపిఐల్, కామన్కాజ్ వంటి సంస్థల తరఫున ప్రశాంత్ భూషణ్ వాదించడాన్ని వ్యతిరేకిస్తూ విశ్రాంత మేజర్ ఎస్కె పునియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణలకు స్పందించాలని ప్రశాంత్ భూషణ్కు బార్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుకు స్పందించిన ప్రశాంత్ భూషన్ తాను ఈ ఎన్జిఓలకు రాజీనామా చేస్తున్నానని సమాధానమిచ్చారు.