దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏపీ రాజధాని అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ముందు నుండి ఈ భూ కుంభకోణాన్ని విచారిస్తున్న సీట్ కి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది.
కాగా సుప్రీం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన శ్రీను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్ విచారణకు సుప్రీం ధర్మాసనం ముందుకు రావటంతో ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే వాదనలు వినిపించడం జరిగింది. ఈ క్రమంలో గతంలో ఇలాంటి కేసులు లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఉదాహరించారు.
అంతేకాకుండా అమరావతి భూ కుంభకోణం పై స్టే ఇచ్చే అధికారం రాష్ట్ర న్యాయస్థానానికి లేదని వాదించారు. ఏపీలో ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటి పైన విచారణ జరుపుతున్నామని… ఇలాంటి విషయాల్లో హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని… సుప్రీం ఆదేశాలకు లోబడాలి అంటూ గతంలో ఇలాంటి విషయాలకు సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. సిట్ దర్యాప్తులో పారదర్శకంగా జరుగుతున్న విచారణ ని ఏపీ హైకోర్టు అడ్డుకోవడం తగదని సరైన విధానం కాదని, ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు అంటూ సుప్రీం ధర్మాసనం కి దుష్యంత్ దావె విన్నవించారు. దీంతో సుప్రీం కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు అదేవిధంగా సీట్ అధికారులకు నోటీసులు జారీ చేసి నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.