ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టు నుండి మరో షాక్ తగిలింది. ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వానికి న్యాయ స్థానాల నుండి వరుస షాక్ లు తగులుతున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లు.. సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.రాజధాని అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని…. ఈ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
3 రాజధానుల అంశం పై హైకోర్టులో ఈ నెల 27న విచారణ జరగనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులకి మద్దతుగా హైకోర్టు వాటి అమలు పై ‘స్టేటస్ కో’ ను విధించింది.