మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా మొదలైన లాక్ డౌన్ ఐదు విడతలుగా కొనసాగి చివరికి దాదాపు అన్ని సడలింపులు ఇచ్చేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి మూడు నెలల వరకు బ్యాంకులకు కట్టాల్సిన ఈఎంఐ లు చెల్లించకపోయినా పర్వాలేదు అని మారిటోరియం సౌకర్యాన్ని కల్పించారు.
ఈ వార్త విని సగటు భారతీయుడు ఆనందించే లోపే ఈ మూడు నెలలు చెల్లించని ఈఎంఐ మొత్తానికి వడ్డీని కలిపి తర్వాత అసలుతో చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. దీనిని చాలామంది వ్యతిరేకించగా చివరికి సుప్రీంకోర్టు కూడా ఈ విషయమై కలగజేసుకొని ఫైనాన్స్ మినిస్ట్రీ కి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల వడ్డీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా చూడమని ఆదేశించింది.
ఈ దెబ్బతో ఒక్కసారిగా ఆ ఎఫెక్ట్ బ్యాంకులు మీద పడింది. స్టాక్ మార్కెట్ సుప్రీంకోర్టు నుండి వచ్చిన నిర్ణయం తర్వాత పూర్తిగా తలకిందులు కాగా కొద్ది బ్యాంకులు నష్టపోతే మరికొద్ది బ్యాంకులు విచిత్రంగా లాభపడ్డాయి. నష్టపోయిన బ్యాంకుల్లో హెచ్.డి.ఎఫ్.సి కోటక్ మహేంద్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండగా లాభపడిన బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐ డి ఎఫ్ సి ఉన్నాయి.
ఇదిలా ఉండగా నష్టపోయిన బ్యాంకుల్లోని కస్టమర్లు ఇదే పరిస్థితి కొనసాగితే తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై మరియు తమకు నిరంతరం పడే వడ్డీ లపై ఏమన్నా ప్రభావం చూపుతుందో ఏమో అని భయపడుతున్నారు.