(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలో భారీ పేలుడు కారణంగా తండ్రీ కొడుకులు మృతి చెందారు. పారిశ్రామిక వాడలోని జయరాజ్ ఫ్లైఉడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బాలు ఆటోలో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందారు.
ఎన్డిఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నది. గన్నవరం సిఐ శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వేస్ట్ మెటీరియల్ స్క్రాప్ కోసం వారు ఇక్కడకు వచ్చినట్లు సిఐ తెలిపారు. క్లూస్ టీమ్తో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.