ఆంధ్ర రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ ఒక శక్తి. భారీ ఫోర్స్. రాష్ట్రంలో లక్షలాది ఫ్యాన్స్.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు అతని సొంతం. అయితే ఇప్పుడు పవన్ అనుభవిస్తున్న ఈ విశేష ప్రజాదరణ వెనుక మూల కారణంగా ఒక ఆడమనిషి ఉన్నారు. ఆమే గనుక లేకపోయి ఉంటే పవన్ సినిమాల్లోకి వచ్చే వాడు కాదు…. అక్కడినుండి అభిమానులను సంపాదించుకునే వాడు కాదు…. ఆ తర్వాత తన వ్యక్తిత్వానికి భక్తులను పొందే వారు కాదు. ఆమె ఎవరో కాదు చిరంజీవి భార్య, పవన్ కళ్యాణ్ వదిన అయిన సురేఖ కొణిదెల.
విషయం ఏమిటంటే…. గతంలో పవన్ ఇంటిదగ్గర ఖాళీగా ఉంటున్న రోజులవి. ఖర్చులకు కూడా రామ్ చరణ్ వద్ద డబ్బులు తీసుకుని కాలం గడుపుతూ ఉండేవాడు. ఇదే సమయంలో చిరంజీవి భార్య సురేఖ చిరంజీవి తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చూడటానికి చక్కగా ఉంటాడు.. మంచి రూపము కలవాడు.. అతడు సినిమాలు చేస్తే బాగుంటుందని మెగాస్టార్ తో చెప్పటం జరిగిందట. మెగాస్టార్ కూడా ఆమె మాటలను సీరియస్ గా తీసుకోగా పవన్ మాత్రం మొహమాట పడ్డాడు.
అయితే ఆ తర్వాత చిరంజీవి చనువుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు. వరుసగా దాదాపు తొమ్మిది ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదు అంటే అది అతని నటన కి, స్టైల్ కి సినిమాల్లోకి వచ్చిన అభిమానం అయితే కాదు అని టాలీవుడ్ ప్రజలందరికీ తర్వాత ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ తర్వాత తెలిసొచ్చింది.
అతని వ్యక్తిత్వానికి, అతనిలో ఉన్న మానవతా విలువలకు, పోరాట స్ఫూర్తికి, ధైర్యానికి ఇప్పుడు అభిమానులు ఇప్పుడు ఇస్తున్న నీరాజనాలే నిలువుటద్దాలు. ఇలా ఆ రోజు కనుక సురేఖ గారు పవన్ హీరో అవ్వాలని చిరంజీవికి చెప్పకపోతే ఉంటే…. అతని గురించి అంతమందికి తెలిసేది కాదేమో! ఒక కథానాయకుడిగా మనమధ్య అడుగుపెట్టిన పవన్ మన అందరి జీవిత కథలను మార్చే నాయకుడిగా ఎదగడానికి ఆమె వేసిన విత్తనమే చాలా బలంగా నిలబడింది అని చెప్పాలి.