అఖిల్ అక్కినేని సినిమాలకి స్టార్ హీరోయిన్స్ నే ఎక్కువగా ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కి పూజా హెగ్డే ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసి షాకిచ్చారు. చెప్పాలంటే అఖిల్ గత మూడు సినిమాలకి పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్స్ ని తీసుకున్నారు. మొదటి సినిమా అఖిల్ లో సాయేషా సైగల్ రెండవ సినిమాలో కళ్యాణి ప్రియ దర్శన్, మూడవ సినిమాకి నిధీ అగర్వాల్ ని తీసుకున్నారు. కాని ఇప్పుడు అఖిల్ కి స్టార్ హీరోయిన్స్ అది కూడా టాలీవుడ్ లో భారీ హిట్స్ అందుకుంటున్న వాళ్ళని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఈ డిసెంబర్ వరకు ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన అఖిల్ – పూజా హెగ్డేల పోస్టర్స్ .. టీజర్ అండ్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా మీద బజ్ బాగానే క్రియోటయింది. అంతేకాదు ఈ సారి అఖిల్ హిట్ గ్యారెంటీ అన్న టాక్ కూడా బాగా వినిపిస్తోంది. నాగార్జున కూడా ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడని అంటున్నారు.
ఈ క్రమంలోనే అఖిల్ 5 ని త్వరలో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి నుంచి వచ్చిన సినిమాలన్ని మంచి హి ట్స్ ని అందుకున్నాయి. చెప్పాలంటే హై టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాని తీస్తాడన్న పేరు సంపాదించుకున్నాడు. రాం చరణ్ తో తీసిన ధృవ సినిమా మెగాస్టార్ కి విపరీతంగా నచ్చి సైరా చేసే అవకాశం ఇచ్చారు. ఇక సైరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ పవర్ స్టార్ సినిమాని అఖిల్ సినిమాని అనౌన్స్ చేశాడు. కాగా అఖిల్ కి జంటగా రష్మిక మందన్న ని ఎంచుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో ఈ విషయంలో అప్డేట్ ఇవ్వబోతున్నారట మేకర్స్.