Pawan kalyan: తగ్గేదేలే నా థియేటర్స్ తీసుకో అని పవన్ కళ్యాణ్తో అంటున్నారట టాలీవుడ్ స్టార్ పొడ్యూసర్ సురేశ్ బాబు. ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో దిగి మిగతా సినిమాలన్నిటిని తారుమారు చేసింది. వాస్తవంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు – కీర్తిసురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రాన్ని 2022, జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండేళ్ళ గ్యాప్ తర్వాత మహేశ్ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైనెంట్స్ వారు భీమ్లా నాయక్గా రీమేక్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. నిత్యా మీనన్ పవన్ సరసన, సంయుక్త మీనన్ రానా సరసన హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా అయితే ఈ ఏడాదే భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్కు కరోనా రావడం, సెకండ్ వేవ్ వల్ల పోస్ట్పోన్ అయింది.
Pawan kalyan: ఆర్ఆర్ఆర్ కోసం పవన్ – రానా వెనక్కి తగ్గుతారా..తగ్గేదే లే అంటూ బరిలో దిగుతారా.
దాంతో ఎట్టి పరిస్థితుల్లో సంక్రాతి బరిలో ఎన్ని సినిమాలొచ్చినా దింపాలని మేకర్స్ డిసైడయ్యారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భీమ్లా నాయక్ మూవీని పోస్ట్పోన్ చేయమని రాజమౌళి పవన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడట. అంతేకాదు రాధే శ్యామ్ కూడా జనవరి 14న రిలీజ్ కానుంది. దాంతో థియేటర్స్ సమస్య కచ్చితంగా వస్తుందనే మరో కారణం. అయినా సరే రానా తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భీమ్లా నాయక్ను పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు. నా థియేటర్స్ కూడా తీసుకోండి. కానీ వెనక్కి తగ్గేది మాత్రం లేదని గట్టిగా పవన్తో చెప్పాడట. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ కోసం పవన్ – రానా వెనక్కి తగ్గుతారా..తగ్గేదే లే అంటూ బరిలో దిగుతారా.