భారత క్రికెట్ అభిమానులకు షాక్ మీద షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితమే భారత వికెట్ కీపర్ బ్యాట్సమెన్ ఎమ్మెస్ ధోని క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి వైతొలగుతున్నట్లు ప్రకటించాడు.
ఇన్స్టాగ్రామ్ లో సురేష్ రైనా “నీతో ఆడడం అద్భుతం ధోని. గర్వంగా నీ బాటలో నడవాలని నిర్ణయించుకుంటున్నా. థాంక్యూ ఇండియా. జై హింద్” అని పోస్ట్ పెట్టాడు రైనా. ఇండియన్ ఆల్రౌండర్ గా రైనా భారత్ కు అద్భుత విజయాలను అందించాడు. 2011 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్ స్క్వాడ్ లో రైనా మెంబర్. అలాగే మూడు ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన తొలి భారతీయ బ్యాట్సమెన్ రైనా. మొత్తంగా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.