గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా “రాధే శ్యామ్”. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాతో ప్రభాస్ సోదరి ప్రశీద నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. వంశీ, ప్రమోద్ లతో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తుంది ప్రశీద. కాగా “రాధే శ్యామ్” సినిమాతో చెల్లి ప్రశీద కి భారీ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేశాడట ప్రభాస్.
ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చిత్ర యూనిట్ “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” అని మోషన్ పోస్టర్ తో పాటు కంప్లీట్ యానిమేషన్ తో కూడిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి భారీ సర్ప్రైజ్ గా ఫీలయ్యారు. అంతేకాదు ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడక్కడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికి ఓవరాల్ గా మాత్రం టీజర్ రచ్చ చేస్తోంది.
ఇక ఈ సినిమాకి ఇన్నాళ్ళు సస్పెన్ గా అనిపించిన మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా యూనిట్ క్లారిటీ ఇచ్చారు. “రాధే శ్యామ్” కి జస్టిన్ ప్రభాస్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. యూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నట్టుగా టీజర్ కి అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ – నాగశ్విన్ ల కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక సినిమాని నిర్మించబోతున్నారు. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ బర్త్ డే కి భారీ గిఫ్ట్ ఇస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ రకంగా చూస్తే వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ప్రభాస్ – నాగశ్విన్ ల సినిమా 2021 అక్టోబర్ 23 న రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.