యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో ఫస్ట్ ఫాన్ ఇండియా స్టార్ గా బాహుబలి ఫ్రాంఛైజీతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మితమవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, అలాగే వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్నాయి. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రూపొందించనున్న ఆది పురుష్ లో రాముడిగా నటించబోతున్నాడు.
ఇప్పటికే గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్ లో టాకీపార్ట్ ని కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే లుక్ ని రిలీజ్ చేసి సినిమా మీద బజ్ ని క్రియోట్ చేశారు. దాంతో ఇక ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆతృతగా టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ‘రాధే శ్యామ్’ యూనిట్ నుంచి సర్ప్రైజ్ రానుందని అంటు గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అందుకు ప్రభాస్ బర్త్ డే రోజు 23 న ముహూర్తం ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీజర్ కి సంబంధించిన పనులు అవుతునట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రభాస్ బర్త్ డే కి మూడు నాలుగు రోజుల ముందు నుంచే ఈ టీజర్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో బజ్ క్రియోట్ చేయాలని చూస్తున్నారట. మొత్తానికి ఖచ్చితంగా టీజర్ మాత్రం రెడీ అయినట్టు మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు రెడీ అవడమే తరువాయి.