Radhe shyam : రాధేశ్యామ్..ప్రస్తుతం టాలీవుడ్లో అలాగే ప్రభాస్ కమిటయిన పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే, ప్రభాస్ సాహో సినిమా సమయంలోనే ఇక తన నుంచి కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా వస్తుందని అభిమానులకి మాటిచ్చాడు. కానీ రాధేశ్యామ్ పీరియాడికల్ లవ్ స్టోరి కావడంతో సెట్స్ కోసం చాలా సమయం పట్టింది. ఆ తర్వాత హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ సర్ధుబాటు కాకపోవడం, తన ఆరోగ్యం బాగోలేక ప్లాన్ చేసి షెడ్యూల్ క్యాన్సిల్ కావడం..కరోనా రెండు వేవ్ల ప్రభావం గట్టిగా పడింది.
ఇక ముందు నుంచి రాధేశ్యామ్ చిత్ర బృందం అభిమానులను కాస్త నిరాశ పరుస్తూనే వచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో టైటిల్ అనౌన్స్ చేసి కాస్త రిలాక్స్ అయ్యేలా చేశారు. అంతేకాదు ఆ తర్వాత నుంచి కూడా మోషన్ టీజర్, విక్రమాదిత్య, ప్రేరణల లుక్, ఆ తర్వాత మరో రెండు ప్రభాస్ లుక్స్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి నాన్ స్టాప్ సర్ప్రైజెస్ ఇచ్చారు. కానీ సెకండ్ వేవ్ తో మళ్ళీ రాధేశ్యామ్ చిత్రబృందం నెమ్మదించింది. ఈ ఏడాది జూలై న రావాల్సిన సినిమాను తీసుకెళ్ళి సంక్రాంతి బరిలో నిలబెట్టారు. దాంతో మళ్ళీ అభిమానుల్లో అసహనం నెలకొంది.
Radhe shyam : నాలుగు నెలలు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది.
ఇప్పుడు దాన్ని పోగెట్టడమే కాదు అంతకు రెట్టింపు ఆనందంలో మునిగేలా రాధేశ్యామ్ మేకర్స్ త్వరలో ఈ సినిమాకి సంబంధించిన వరుస అప్డేట్ ఇవ్వనున్నారట. అందుకోసం ప్లాన్ కూడా రెడీ అయినట్టు సమాచారం. ప్రభాస్ సూచనల మేరకు రిలీజ్కి ముందు నాలుగు నెలల పాటు ప్రమోషన్స్తో హోరెత్తించనున్నారట. అంటే రాధేశ్యామ్ నుంచి వరుసగా నాలుగు నెలలు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ముందు కొన్ని మేకింగ్ వీడియోస్ వదలనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత సింగిల్స్, టీజర్, ట్రైలర్, వీడియో సాంగ్స్ వదులుతారని సమాచారం. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు రానుందో. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, జిల్ ఫేం రాధకృష్ణ సంగీతం అందిస్తున్నారు.