జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అర్జంటుగా సోషల్ మీడియాపై కన్నేయాల్సిందే. ఎందుకంటే , ఆయన్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు కాబట్టి!. ఈ ట్రోలర్లలో ఆయన అంటే గిట్టని ఓ పార్టీ నేతలు ఉన్నారనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. పార్టీలతో సంబంధం లేని వారు కూడా ఈ ట్రోలింగ్లో ఉన్నారంటున్నారు.
ఇంతకు ఏం జరిగిందంటే…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో కొన్ని పంట పొలాలను బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల బాధలు తెలుసుకుని.. వెంటనే పర్యటన చేయాలని నిర్ణయించాం, అందుకే కరోనా నిబంధనలు ఉన్నా… పర్యటన చేపట్టామని అన్నారు. `ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటించా, కంకిపాడులో వెయ్యి ఎకరాల ఆయకట్టులో 1600 మంది రైతులు ఉన్నారు, అందులో వెయ్యి మంది కౌలు రైతులే ఉన్నారు, ఎకరానికి 30 నుండి 35వేలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు, నష్టపోయిన రైతులు అరవై శాతం కౌలు రైతులు ఉన్నారు, 151 మందిని గెలిపించి పంపిస్తే.. అసెంబ్లీ లో బూతులు తిట్టుకుంటున్నారు, కష్టం లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలో చర్చ కూడా చేయడం లేదు, ఎకరానికి 25 నుండి 30 వేలు నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి, హైదరాబాదు లో ఒక ఇంటికి పది వేలు ఇచ్చారు.” అని అన్నారు.
అంత బాగానే ఉంది కానీ పవన్ గారు…
పవన్ కళ్యాణ్ రైతుల కోసం క్షేత్ర స్థాయిలో అభినందనీయం. రాజకీయ నాయకుడిగా ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుడిగా అది ఆయన బాధ్యత. ప్రభుత్వాన్ని జాగరుకుల్నీ చేయడం విపక్ష నేతల విధి. అయితే, ఈ పర్యటనలో పవన్ పొలంలో పర్యటించిన తీరుపై నెట్టింట ట్రోల్ జరుగుతోంది. రైతులకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకునేందుకు పవన్ పంట చేలల్లో దిగారు. మొక్కలను పరిశీలించాలనుకున్న ఈ సందర్భంగా చేతులకు `గ్లౌజులు` తొడుక్కొని సదరు తతంగం పూర్తి చేశారు. దీనిపైనే నెట్టింట ట్రోల్ చేస్తున్నారు . రైతులు ఎక్కడైనా గ్లౌజులు తొడుక్కుంటారా? పొలంలోకి ఎలా వెళ్లాలో కాస్త తెలుసుకొండి పవన్ గారు…. వంటివి సదరు ట్రోలింగ్లోని తక్కువ అభ్యంతరకర , మీడియాలో ఉపయోగించదగిన పదాలు.!