Survey : ప్రస్తుతం భారతదేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే… అది భారీగా పెరిగిపోయిన ఇంధన ధరల గురించే. ఇప్పటికే దేశంలోని సగం రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది. గత సంవత్సరం 70-80 రూపాయల మధ్యలో ఉండి పెట్రోలు ఈరోజు సెంచరీ దగ్గరికి వచ్చేసింది. డీజిల్ 60-70 మంది ఉండేది… ఇప్పుడు ఒక లీటరు 90 రూపాయలను టచ్ చేసింది. ఇలాంటి సమయంలో ప్రజల జీవనశైలిలో కూడా ఆటోమేటిక్ గా మార్పులు చోటు చేసుకుంటాయి.
పెరిగిన పెట్రోల్ ధరలు కి కారణాలు అనేకం ఉన్నాయి/ అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ పన్ను… అది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కనికరం చూపకుండా వేసే వ్యాట్ టాక్స్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే సగటు జీవి బడ్జెట్ పైన ఈ ధరల మోత ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
దీనికి సంబంధించిన ఒక సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే…. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 291 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ప్రజలపై చూపిస్తున్న విషయంపై వారు లోతుగా అధ్యయనం చేశారు. 22 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో కొన్ని ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి….
- 21 శాతం మంది పెట్రోల్ ఖర్చుకు నిత్యావసరాల పై కోత పెట్టుకున్నారు
- 14 శాతం మంది తమ పొదుపు డబ్బులు తగ్గించుకుంటున్నారు
- 51 శాతం మంది ఇతరత్రా ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బు పెట్రోల్కు వాడుతున్నారు
- ఇక ఈ సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
- 89 శాతం మంది అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాస్క్ తగ్గించాల్సిందే అని తేల్చారు
- ఇక వీరు కాకుండా ఎనిమిది శాతం మంది ప్రభుత్వం ఇస్తున్న పన్నుల విధానం బాగుందని చెప్పడం గమనార్హం.