బిగ్ బాస్ 4 కు మొదట నెగటివ్ రెస్పాన్స్ వినిపించింది. కంటెస్టెంట్ లు ఎవరూ పెద్దగా బయట పేరున్న వారు లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం త్వరగానే దిద్దుబాటు చర్యలకు దిగింది. షో లో ఎవరిమీద అయితే క్రేజ్ ఉందో వారినే హైలైట్ చేస్తూ వస్తోంది. మొదటి మూడు రోజులు గంగవ్వ మీదే ప్రోమోలు కట్ చేసిన బిగ్ బాస్ తర్వాత తన దృష్టిని దివి మీద పెట్టింది.
ఆమె మాట్లాడకుండా ఉంటోందన్న కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె మాట్లాడే టాస్క్ ను అప్పగించింది. ఆ ఒక్క ఎపిసోడ్ తో దివి పాపులర్ అయిపోయింది. ఇక నిన్న శనివారం నాగార్జున తన పవర్ఫుల్ హోస్టింగ్ తో బిగ్ బాస్ ను నిలబెట్టాడు. అభిమానుల దగ్గరనుండి వస్తున్న రెస్పాన్స్ సరిగ్గా తీసుకున్న యాజమాన్యం నాగార్జున చేత అవే చెప్పించారు.
గంగవ్వను సరిగ్గా మాట్లాడమన్నారు. సూర్యకిరణ్ ను అందరి విషయాల్లో తలదూర్చొద్దు అని నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక నోయెల్ మీద కూడా నెగటివ్ ఒపీనియన్ ఇచ్చారు. నిన్న మొత్తంగా నామినేట్ అయిన 7గురు లోంచి ముగ్గురు సేఫ్ అయిన విషయం తెల్సిందే. గంగవ్వ, అభిజీత్, సుజాత సేఫ్ అవ్వగా అఖిల్, సూర్యకిరణ్, మెహబూబ్, దివి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈరోజు కచ్చితంగా నామినేట్ అవ్వబోతున్న వ్యక్తి సూర్యకిరణ్ అని చెబుతున్నారు.
వచ్చిన రోజు నుండి అటు ప్రేక్షకులను ఇటు కంటెస్టెంట్స్ ను తన ఓవరాక్షన్ తో సూర్య కిరణ్ విసిగించాడు. అందరి విషయాల్లో దూరిపోయి, అందరికీ క్లాసులు పీకుతూ సూర్యకిరణ్ నెగటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. నిన్న నాగార్జున ఇదే విషయాన్ని చెప్పగా ఇప్పటికే ఆలస్యమైపోయింది. సో బిగ్ బాస్ 4 లో మొదటి ఎలిమినేటడ్ కంటెస్టెంట్ సూర్య కిరణ్ అన్నమాట.