బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయట పడుతున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు నటి రియా చక్రవర్తి సహా పలువురిపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి రియా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి రియా, ఆమె సోదరుడు ఇద్దరూ పెద్ద ఎత్తున డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని మీడియా సంస్థలు స్టేట్మెంట్లను వెలికితీయగా.. తాజాగా సుశాంత్ వంట మనిషి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు తెలిపాడు.
సుశాంత్ దగ్గర కుక్గా పనిచేస్తున్న అశోక్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను సెప్టెంబర్ 2019లో డ్యూటీ నుంచి తీసేశారని అన్నాడు. తాను సుశాంత్ వద్ద 2016 నుంచి 2019 వరకు పనిచేశానని తెలిపాడు. అయితే సుశాంత్ అంత సులభంగా ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయడని, అతను చాలా మంది వ్యక్తి అని, ఎక్కువ కాలం పాటు పనిచేసిన వాళ్లను అతను అసలు తీసేయడని అన్నాడు. తనకు సుశాంత్, రియాల మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చిందని, తనను ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు అందులో ఉందని, దీంతో తాను సుశాంత్ దగ్గర డ్యూటీ మానేశానని చెప్పాడు.
అయితే తరువాత అందుకు రియానే కారణమని తనకు తెలిసిందని అతను చెప్పాడు.ఇక సుశాంత్ దగ్గర బాడీగార్డ్గా పనిచేసిన సాహిల్, అకౌంటెంట్ రజత్లను అక్టోబర్లో తీసేశారని అశోక్ కుమార్ తెలిపాడు. డిసెంబర్ 2019లో ఢిల్లీలో ఉండే సుశాంత్ సోదరి ముంబైకి వచ్చిందని, ఆమె ముంబైలో ఉంటున్న మరో సోదరితో కలిసి సుశాంత్ ఇంటికి వచ్చారని, అయితే వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉంచారని, సుశాంత్ బిజీగా ఉన్నాడు, ఇప్పుడు మిమ్మల్ని కలవడు..
అని వారికి లోపలి నుంచి మెసేజ్ పంపారని తెలిపాడు. కాగా అక్టోబర్-నవంబర్ నెలల్లో సుశాంత్కి డెంగ్యూ వచ్చి రెస్ట్ తీసుకున్నాడని, అయితే సుశాంత్ డిప్రెషన్తో బాధపడుతున్నట్లయితే రియా ముందే ఎందుకు చెప్పలేదని అశోక్ కుమార్ అన్నాడు. సుశాంత్ సింగ్ చాలా మంచి వాడని, ఎవరిపైనా ఎప్పుడూ కోపంతో అరవలేదని, అందరినీ మంచిగా చూసుకునేవాడని అశోక్ కుమార్ తెలిపాడు. అయితే సుశాంత్ మాజీ గర్ల్ఫ్రెండ్ అంకితా లోఖండే మాత్రం.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని పేర్కొంది. ఇక సుశాంత్ తండ్రి కేకే సింగ్ మాట్లాడుతూ.. రియా చక్రవర్తి తన కుమారుడు సుశాంత్కు డిప్రెషన్ మెడిసిన్ను అధిక డోసులో ఇచ్చిందని, తన కుమారుడి జీవితాన్ని ఆమె పూర్తిగా కంట్రోల్లో ఉంచుకుందని ఆరోపించారు. మరో వైపు సుశాంత్ సింగ్ కేసును సీబీఐచే దర్యాప్తు చేయించాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?