బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కి సంబంధించి రోజుకో కొత్త విషయం బయట పడుతుంది. ఎక్కడ మొదలైందో అన్న ప్రశ్న కి సమాధానం దొరకడం లేదు. ఇప్పటికే ఈ కేసులో రక రకాల ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఒక సినీ నటుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఇంతగా చర్చ జరగటం.. అటు ఇండస్ట్రీ వర్గాలు ఇటు రాజకీయ నేతలు ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయటం ఇదే ప్రథమం అంటున్నారు. జరిగింది ఆత్మహత్య అని కొందరు.. కాదు.. ప్రీప్లాన్ మర్డర్ అని కొందరు మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ మిస్టరీని చేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారులు సుశాంత్ ఇంటి హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ని..ఆయన మాజీ మేనేజర్ సిద్దార్థ్ పితానిలను విచారించారు. వీరిద్దరి వాంగ్మూలాలు ఈ కేసుకు కీలకం కానున్నట్లు తెలుస్తుంది.
హౌస్ కీపర్ నీరజ్ ను సీబీఐ అధికారులు గతంలో రెండుసార్లు ప్రశ్నించగా తాజాగా మూడోసారి మరింత క్షుణ్ణంగా విచారించినట్లుగా తెలుస్తుంది. కాగా నీరజ్ అనే వ్యక్తి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తుంది. సుషాంత్ గంజాయి తీసుకునే వాడని..వారానికి రెండు సార్లు ఇంట్లో పార్టీ చేసుకునే వాడని, మద్యం తో పాటు సిగరెట్స్ లో గంజాయి నింపి తీసుకునేవాడని సీబీఐ వాళ్ళ ముందు వెల్లడించినట్టు సమాచారం. ఈ ఇద్దరిని విచారించిన అధికారులు ముంబయిలోని సుశాంత్ ఇంటిని మరోసారి సందర్శించి.. వివరాల్ని సేకరించారట.
ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన నలుగురు ఎయిమ్స్ సభ్యుల ఫోరెన్సిక్ టీం ఒకట్రెండురోజుల్లో ముంబయికి రానున్నట్లుగా చెబుతున్నారు. ముంబయిలో వారు సుశాంత్ ఆటాప్సీ రిపోర్టును పరిశీలించనున్నారట. ఇక ఈ విషయంలో ఒక వైపు సోషల్ మీడియాలో జనాలు, సినిమా వాళ్ళు..మరో రాజకీయ నాయకులు రక రాకులుగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?