సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనంతరం చాలా మంది నెటిజన్స్.. మీడియా.. రియానే ప్రధాన నింధితురాలు అని దాదాపుగా డిసైడయిపోయిన్ కథనాలు రాస్తున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా రియానే సుశాంత్ సింగ్ మరణానికి కారణం అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ కేసులో రోజుకో మలుపు..రోజుకో కొత్త విషయం బయట పడుతుంది.
ఈ క్రమంలో సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం అందరికీ సంగతి తెలిసిందే. ఈ గురువారం కూడా దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ జరిగింది. ఆ తర్వాత విచారణ సాగించేందుకు గాను సీబీఐ సిద్ధమైందని తెలుస్తుంది. అయితే పలు మీడియా చానెళ్లతో కంగన రనౌత్ సహా సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా కొత్త పరిణామాలకి తావిస్తున్నాయి. పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
2016 వరకూ సుశాంత్ కి ఎలాంటి సమస్యలు లేవని మానసిక నిపుణుల్ని కలవలేదని అంకిత లోఖండే గట్టిగా చెబుతుంది. సుశాంత్ కి మాదక ద్రవ్యాల తీసుకునే అలవాటు ఉందని రియా చెప్పుకొచ్చిన మాటలని అంకిత ఖండించింది. దీంతో రగిలిపోయిన రియా డైరెక్ట్ గా అంకితనే టార్గెట్ చేస్తోంది. సుశాంత్ తనకు రియా వల్ల ఎదురైన వేధింపుల విషయమై కంగనతో చెప్పుకుని బాధపడ్డాడని.. ఇటీవల అంకిత లోఖండే చెప్పడండంతో రియా యూ టర్న్ తీసుకుంది.
ఇలా కాదని .. వేరొకరితో నిశ్చితార్థం చేసుకుని ఇంకా సుశాంత్ ముందు విధవరాలిలా ప్రవర్తిస్తోందని.. సుశాంత్ తో బ్రేకప్ అయ్యాక సుశాంత్ ఫ్రెండుతోనే డేటింగ్ చేసిందని రివర్స్ అయి గట్టి కౌంటర్ తో ఎటాక్ చేసింది. సుశాంత్ మృతి సంగతి అటుంచితే ఇప్పుడు రియా వర్సెస్ అంకిత ల మద్య వివాదం బాగా ముదురుతోంది. ఆ ఇద్దరి మధ్య మాట మాటా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ ఇద్దరి ద్వారా ఇంకెన్ని విషయాలు బయడపడతాయో అని జనాలు చెప్పుకుంటున్నారు.