బాలీవుడ్ నటుడు స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అప్పట్లో అందరినీ విస్మయానికి గురి చేసింది అన్న సంగతి తెలిసిందే. కారణం లేకుండా సరిగ్గా లాక్ డౌన్ సమయంలో జూన్ 14 వ తారీకు ముంబై లో తన ఫ్లాట్ లో ఉరివేసుకొని చనిపోవడం దేశ ప్రధాని తో పాటు చాలా మంది సెలబ్రిటీలకు ఆయన అభిమానులకు భారీ షాక్ ఇవ్వటం జరిగింది.
దీంతో సుశాంత్ మరణం పట్ల రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కావాలని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అవకాశాలు ఇవ్వకుండా..అతని మరణానికి కారణమయ్యారని బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే స్టార్ నటులు కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత సుశాంత్ లవర్ రియా చక్రవర్తి వలన తన కుమారుడు చనిపోయినట్లు.. సుశాంత్ తండ్రి మరియు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అనేక విషయాలు వెలుగులోకి వస్తు ప్రస్తుతం సుశాంత్ కేసును నార్కో అదేవిధంగా సిబిఐ, ఈసీ వంటి విచారణ సంస్థలు కేసును టేకప్ చేస్తున్నాయి.
ఇలా ఉంటే జనవరి 21వ తారీకు సుశాంత్ 35 వ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రూస్ గంజ్లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు పెట్టాలని డిసైడ్ అయింది. కారణం ఈ రోడ్డులో ఎక్కువ మంది బీహార్ వాసులే నివసిస్తున్నారని… ఇందుకోసం ఆ రోడ్డుకు సుశాంత్ పేరు పెట్టాలని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గత ఏడాది ప్రస్తావనకు తీసుకురాగా తాజాగా అమలులోకి రావడంతో సుశాంత్ అభిమానులు ఇది అతని పుట్టినరోజుకి దక్కిన అరుదైన గౌరవం అని ఆనందిస్తున్నారు.