సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రోజుకో మలుపు..రోజుకో కొత్త విషయం బయట పడుతుంది. దీంతో ఈ వ్యవహారం అంతకంతకు ఉత్కంఠతగా మారుతుంది. రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ జరిపిన క్రమంలో మాదక ద్రవ్యాల కొనుగోళ్లు డ్రగ్ దందాపై విచారణ సాగిస్తున్నారు. ఈ కేసు విషయంలో రియాకు వ్యతిరేకంగానే అందరూ ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ కుటుంబీకుల్లో అతడి సోదరి శేతా సింగ్ రియాపై ఒంటి కాలుతో లేస్తూ మేకులా తయారైంది.
రియా చక్రవర్తి ఆగడాలపై అంతెత్తున ఎగిరి పడుతోంది శేతా సింగ్. ముఖ్యంగా రియా నేరుగా జాతీయ చానెళ్ల లైవ్ కి వెళ్లి సుశాంత్ గంజాయిని తీసుకునేవాడని వెల్లడించడంతో ఆ ఇంటర్వ్యూపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ప్రకటనలకు సూటిగానే కౌంటర్లు వేస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంంది రియా చక్రవర్తి. కాగా రెండు రోజులుగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుశాంత్కు డ్రగ్స్ అలవాటు ఉందని.. ప్రతి రోజు మద్యం తాగుతాడని… అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటు సుశాంత్ తండ్రితో సహా అతడి కుటుంబ సభ్యులు అందరూ కూడా రియాపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రియా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసింది.
దాంతో రియా ఆరోపణలపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్పందించింది. సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించిన చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. శ్వేతాసింగ్ విమాన ప్రయాణ టిక్కెట్ షేర్ చేసి తనకు సుశాంత్పై ప్రేమ లేకపోతే ఈ యేడాది జనవరిలో తాను అమెరికా నుంచి ఇండయాకు ఎందుకు వస్తానని సూటిగా ప్రశ్నించింది. మరి శ్వేతా సింగ్ వ్యాఖ్యలపై రియా ఎలా స్పందిస్తుందో చూడాలి.