సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశమంతా సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సుశాంత్ ది ఆత్మహత్య అయినా కూడా దీని వెనుక వేరే కోణం ఉందంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా సుశాంత్ మరణం వెనుక అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పలు పిటీషన్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా సుశాంత్ తండ్రి కె కె సింగ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. తన కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసి దోచుకుందని పిటీషన్ లో ఆరోపించారు కె కె సింగ్. అలాగే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె ప్రమేయం ఉందని ఆరోపణలు చేసారు.