బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపింది. పైకి మాత్రం సూసైడ్ లా ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆధారాలు మరియు పరిస్థితులు గమనిస్తే ఈ విషయం పై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇక ఈ కేసు విషయంలో పోలీసుల తరఫు నుండి… అతని ప్రేయసి తరపు నుండి, తల్లిదండ్రుల నుండి మరియు బాలీవుడ్ నుండి రోజుకు ఒక కథ బయటికి వస్తుంది ఈ నేపథ్యంలో సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ అసెంబ్లీలో ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు స్పీకర్ తో చాలా విపరీతంగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు కచ్చితంగా సుశాంత్ మరణం విషయాన్ని సిబిఐ ఎంక్వయిరీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వారి ఊపు చూస్తుంటే రేపోమాపో ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజలు మరియు మీడియా వారు అనేక సార్లు సిబిఐ కి కేసులు అప్పగించాలని డిమాండ్ చేసినా కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు కానీ బీహార్ ఎమ్మెల్యేలు ఇలా పట్టుబట్టి కూర్చోవడంతో త్వరలోనే సుశాంత్ కు న్యాయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?