బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తర్వాత అతని ఆత్మ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. దీన్ని హత్యగా అనుమానపడుతూ ఇప్పటికే ఈ కేసు ముంబై పోలీసుల నుండి సిబిఐ వారి చేతికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని చాలామంది సుశాంత్ కేసుపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కెకె సింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
విషయం ఏమిటంటే…. సుశాంత్ సింగ్ సంపాదించిన ఆస్తికి…. అతనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న వస్తువు కి సంబంధించిన అధికారం ఇకమీదట తనదేనని…. తండ్రిగా తానే కొడుకుకి న్యాయబద్ధమైన వారసుడినని సుశాంత్ తర్వాత అతని ఆస్తిని…. అతను కి చెందిన ప్రతిదీ తన అధీనంలోనే ఉంటుంది అని తేల్చి చెప్పారు. ఇలా సొంత తండ్రి తన కొడుకుకి తానే చట్టబద్ధమైన వారసుడిని అని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కెకె దింగ్ మాట్లాడుతూ సుశాంత్ సింగ్ ఫ్యామిలీ అంటే తను, తన కుమార్తెలు మాత్రమేనని చెప్పారు. ఇక వరుణ్ సింగ్ అనే లాయర్ ను, వికాస్ సింగ్ అనే సీనియర్ అడ్వకేట్ ను తమ ఫ్యామిలీ తరపున తాము నియమించుకున్నామని కూడా కెకె సింగ్ తెలిపారు. ఇక తమ అనుమతి లేకుండా సుశాంత్ ఆస్తుల గురించి మాట్లాడటం జరుగకూడదని… దానిపై ఎవరికీ ఎలాంటి హక్కు గాని లేదని అన్నారు.
తమకు సంబంధం లేని ఇంకెవరైనా వచ్చి దీనిలో మాకూ వాటా ఉంది అని వచ్చినా… వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు. ఈ మాటలు సుశాంత్ తండ్రి ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారని కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అలాగే సుశాంత్ చనిపోయిన విషయమై ఇప్పుడు జరుగుతున్న సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తమ సంపూర్ణ సహకారాలు అందిస్తామని కెకె సింగ్ చెప్పడం గమనార్హం.
మరి ఇంతకీ అసలు కేకే సింగ్ ఒక్కసారిగా వచ్చి…. తన కొడుకు కి సంబంధించిన వరకు ప్రతిదీ నేను చూసుకుంటాను అని చెప్పడం వెనుక ఉన్న అర్థం ఏమిటో ఎవరికీ తెలియట్లేదు. దీనికి సుశాంత్ మరణానికి, ఇన్వెస్టిగేషన్ కి ఏమైనా లింక్ ఉంటుంది అంటారా…?