(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పశువులు దొంగిలిస్తున్నాడన్న అనుమానంతో త్రిపురలో ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ధలాయి జిల్లాలోని రైష్యబారి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గత మంగళవార రాత్రి 36 ఏళ్ల బుధి కుమార్ త్రిపుర అనే వ్యక్తి ఒక పశువుల కొట్టంలోకి ప్రవేశించడం చూసిన జనం అతనిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు వెళ్లి త్రిపురను రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను గురువారం ఉదయం మృతి చెందాడు.