(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలిపై అనుచితంగా ప్రవర్తించారన్న అభియోగంపై ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే…తనను డేవిడ్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి గుంటూరు పట్టణంలోని అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ బాలకృష్ణ ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఆ యువతిని ట్రాప్ చేశాడు, విచారణ పేరుతో ఇంటికి పిలిపించి ఆమెపై అత్యాచారానికి ఒడిగడ్డాడు. అదే పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాము యువతి తల్లిని లాడ్జికి పిలిచినట్లు సమాచారం. న్యాయం కోసం వెళితే పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జిల్లా ఎస్పికి పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై ప్రాధమిక విచారణ అనంతరం ఎస్ఐ జి బాలకృష్ణ, కానిస్టేబుళ్లు సిహెచ్ రాము, బి హనుమంతరావులను గుంటూరు రేంజ్ ఐజి వినీత్ బ్రిజ్లాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పి రామకృష్ణ తెలిపారు.