SV Krishna Reddy: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా కథ పాతదా కొత్తదా అని చూడకుండా స్టోరీ బాగుంటే కథ ఎంత పాతదైనా ఆదరిస్తున్నారు. దానికి నిదర్శనలే ‘కాంతార’, ‘కార్తికేయ 2’. పరమ మూఢ భక్తితో కూడిన కథతో తీసిన చిత్రాలను కూడా ప్రేక్షకులు ఇప్పటి రోజులో ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం ఉన్న సినిమాలను కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా శుభలగ్నం ఫేమ్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా పేర్కొన్నాడు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఎస్వీ కృష్ణారెడ్డి శుక్రవారం రోజు రాజనగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రులతో మాట్లాడాడు.
SV Krishna Reddy: సినిమాల్లో రీఎంట్రీ
2014లో యమలీల తరువాత మళ్ళీ ఇప్పటివరకు సినిమా తీయలేదు. కాగా ఇప్పుడు ‘ఆర్గానిక్ మామ- హైబ్రిడ్ అల్లుడు’ సినిమా తీస్తున్నట్లు తాజాగా వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా పూర్తయిందని పేర్కొన్నాడు. 2023 జనవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సినిమాలో సహాయ్లరగర్, మృణాళిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారట. ఆర్గానిక్ మామగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో తాను తీసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా కుటుంబ నేపథ్యంతో పాటు, హాస్య రసం, కష్టాలు, కన్నీళ్లు, మంచి సంగీతంతో కూడిన వినోదం ఉంటాయని చెప్పారు.
ఈ తరం వారికి నచ్చేలా సినిమా
మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల్లో కూడా చాలా మార్పు వస్తుందని… ఆ విషయాన్ని దగ్గరనుంచి నోటీస్ చేసి.. వారిని ఎంటర్టైన్ చేసేలా ఒక కథ రాశానని కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడు. ‘ఆర్గానిక్ మామ- హైబ్రిడ్ అల్లుడు’ సినిమా కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపాడు. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుందన్నారు. గతంలో వచ్చిన మాయలోడు, వినోదం సినిమాలను మరిపించేలా ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ మూవీలోని వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు అన్ని ఉంటాయట. అంతే కాకుండా ప్రతి అంశంలోనూ కామెడీ ఉంటుందట.
ఇక ఆర్గానిక్ మామ -హైబ్రిడ్ అల్లుడు సినిమా ద్వారా ‘ప్రేమను ప్రేమతో కలుపుకోవాలి కానీ పగతో కాదు’ అనే సందేశం ఇవ్వనున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ప్రేమించడం తెలిసిన వాడికి కష్టం తెలియదని.. పగతో రగిలిపోయేవాడికి సుఖం దొరకదనే విషయం తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నాడు. ఇదే విషయాన్ని అందరికీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందన్నాడు. ప్రేక్షకులు ఆదరిస్తే ఇంకొంతకాలం కొనసాగుతానని ఆయన వెల్లడించారు.