SVP: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మహేష్ ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రస్తుతం బయట రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న డైరెక్టర్ తమన్… “దూకుడు” తరహా ఫుల్ ఎంటర్ టైనర్ సినిమా అంటూ అప్పట్లో తెలపడం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ పరుశురాం ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు తో సినిమా చేయడం కోసం ఎప్పటినుండో అవకాశం కోసం ఎదురు చూడటం జరిగింది అని చివరాకరికి దక్కింది అని అన్నారు. అదే రీతిలో మహేష్ బాబుకి తాను పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. ఒక అభిమాని మహేష్ బాబు వెండితెరపై ఏ విధంగా ఉండాలి అని భావిస్తున్నారో.. ఆ తరహాలోనే ఈ సినిమా స్టోరీ ఉందని సినిమాలో మహేష్ క్యారెక్టర్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది అని.. మంచి కంటెంట్ అదే రీతిలో కడుపుబ్బా నవ్వు కోతగా సినిమా అంటూ తాజాగా పరశురాం సినిమా గురించి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండింగ్ అవుతుంది.
Read More: Mahesh: అభిమానులకు డబుల్ ధమాకా రెడీ చేస్తున్న మహేష్ బాబు..!!
ఇదిలా ఉంటే ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి వీడియో లేదా పోస్టర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది తండ్రి కృష్ణ పుట్టిన రోజు నాడు సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్.. మహేష్ అభిమానులకు ఇవ్వటం ఒక సెంటిమెంట్. ఈ ఏడాది కుదరకపోవడంతో.. తన పుట్టినరోజు నాడు.. సర్కారు వారి పాట సినిమా అదే రీతిలో త్రివిక్రమ్ సినిమా కి సంబంధించిన టైటిల్ లేదా పోస్టర్.. రిలీజ్ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు సమాచారం.