స్వామి అగ్నివేశ్ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కీలక అవయవాల వైఫల్యంతో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్యసమాజ్ నేతగా, ప్రముఖ సామాజిక కార్యకర్తగా అగ్నివేశ్ అందరికీ సుపరిచితమే.
ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ లో మంగళవారం కాలేయ సంబంధిత సమస్యతో ఆయన చేరారు. 1939లో సెప్టెంబర్ 21న జన్మించిన అగ్నివేశ్ ది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం స్వస్థలం. ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించిన అగ్నివేశ్ హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్య సమాజ్ పట్ల ఆకర్షితుడు అయిన ఆయన ఆ సిద్ధాంతాల ప్రకారమే ఆర్యసభ పార్టీను నడిపారు. భిన్న మతాల మధ్య పరిష్కారం దిశగా ఆయన వారధిలా పనిచేసారు. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలియజేసారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?