తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. హౌస్ లో ఎప్పటికప్పుడు కొత్త టాస్క్ లు ఇస్తున్న బిగ్ బాస్… ప్రేక్షకుడు అని ఎంతగానో ఎంటర్టైన్ చేసే రీతిలో షో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఇదే సమయంలో ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ టిఆర్పి రేటింగులు పడిపోకుండా హౌస్ లోకి వైల్డ్ కార్డు రూపంలో కొత్త ముఖాలు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా వెళ్లిన స్వాతి దీక్షిత్ దాదాపు పదిరోజులు హౌస్ లో ఉండటం జరిగింది.
గత వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ హౌస్ లో ఉన్నంత కాలం….తన హాట్ హాట్ అందాలతో ఎక్కువగా మగవాళ్ళతో కలివిడిగా ఉంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం బయట వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇలాంటి తరుణంలో తాజాగా అమ్మ రాజశేఖర్ పై సంచలన కామెంట్ చేసింది స్వాతి దీక్షిత్. పూర్తి విషయంలోకి వెళితే హౌస్ లో చాలా లవ్ ట్రాక్ లు సాగుతున్నాయి. అమ్మ రాజశేఖర్ కి ఎవరైనా లైన్ వేస్తున్నరా అని యాంకర్ స్వాతి దీక్షిత్ ని ప్రశ్నించారు.
దానికి స్వాతి దీక్షిత్ ఒకేసారి పగలబడి నవ్వి…. అసలు అమ్మ రాజశేఖర్ కి లైన్ వేసే ఆలోచన ఎవరికైనా వస్తుందా పైగా ఆయన ఎక్కువగా వంటింట్లోనే ఉంటారు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. హౌస్ లో ఉన్నా గాని బయట ఎటువంటివి చూపిస్తున్నారు ఎవరికీ తెలియదని… ప్రస్తుతం తాను కూడా ఇంట్లో ఉన్నంతకాలం జరిగిన ఎపిసోడ్ లు చూడలేదని స్వాతి దీక్షిత్ చెప్పుకొచ్చింది.