ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టి20 ప్రపంచకప్ 2022 టోర్నీ గురించి క్రికెట్ క్రీడాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ వున్నారు. అయితే ఇది ప్రారంభానికి ముందే సరికొత్త రికార్డు సృష్టించి అదరహో అనిపించింది. విషయం ఏమంటే, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒక్క నెలలో జరగనున్న మ్యాచ్లకు కలిపి దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ICC ప్రతినిధి ఒకరు తాజాగా ప్రకటించారు. 82 దేశాల నుంచి అభిమానులు ఈ టికెట్లు కొనుగోలు చేశారని.. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొననుండగా.. ఈసారి అన్ని స్టేడియాలు ఫుల్ అయ్యేలా కనిపిస్తుందంటూ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో అతిపెద్ద గ్రౌండ్ MCG (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్) కెపాసిటీ 86,174 కాగా.. మొత్తం సీట్లు ఫుల్ అయ్యాయని ICC తాజాగా తెలిపింది. ఈ టికెట్స్లో దాదాపు 85వేల టికెట్లు ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం కేటాయించారు. చిన్నపిల్లలకు సంబంధించిన టికెట్ రేటును 5 ఆస్ట్రేలియన్ డాలర్లుగా.. పెద్దవాళ్లకు 20 ఆస్ట్రేలియన్ డాలర్లుగా నిర్థారించారు. ఈ టికెట్స్ అన్ని కేవలం ఫస్ట్ రౌండ్, సూపర్-12 మ్యాచ్లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ల టికెట్లు విడుదల చేయాల్సి ఉంది.
ఈ విషయమై ICC ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. ”T20 ప్రపంచకప్ 2022కు అభిమానుల నుంచి మంచి డిమాండ్ ఉంది. దాంతో ఇప్పటికే దాదాపు 5 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి. ప్రపంచకప్కు ఇంకా నెల సమయం ఉన్నప్పటికి అభిమానులు లైవ్లో మ్యాచ్లు చూడడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వెబ్సైట్లో మరికొన్ని టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. వీలైనంత తొందరగా అవికూడా అందుబాటులో ఉంచుతాము.” అని పేర్కొన్నాడు.