T20 WC: ప్రపంచ మేటి చెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా ఈ మధ్య అతి సాధారణ జట్టుగా మారిపోయిన విషయం తెలిసిందే. క్రికెట్ లో చిన్న పెద్ద టీమ్ అనే తేడా లేకుండా ప్రతి జట్టుతో గెలుపొందేందుకు ఆస్ట్రేలియా విపరీతంగా శ్రమిస్తోంది. సొంత గడ్డపై తప్పించి విదేశీ వేదికల్లో వారి పర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంది.
ఇక మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో అన్ని జట్లు అందుకు సన్నాహకంగా సిరీస్ లు ఆడడం మొదలు పెట్టాయి. ఇదే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తో పోరుకు ఆస్ట్రేలియా కరేబియన్ గడ్డపై అడుగు పెట్టింది. మొత్తం ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ నేటితో ముగిసింది. దీనిని ఆస్ట్రేలియా 1-4 తో వెస్టిండీస్ చేతిలో ఘోరపరాభవం చూడటం గమనార్హం.
మొదటి మూడు మ్యాచ్ లలో వెస్టిండీస్ హిట్టర్ల ధాటికి నిలువలేక సిరీశ్ సమర్పించుకుని నాలుగవ కొద్దిలో మ్యాచ్లో గండం గట్టెక్కింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా రస్సెల్ ను మిచెల్ స్టార్క్ నిలువరించడంతో ఊపిరిపీల్చుకుంది. ఇక చివరిదైన ఐదవ టి-20 లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోవడంతో వెస్ట్ ఇండీస్ 41 పరుగులతో భారీ విజయం సాధించింది.
అదే నాలుగవ టి-20 లో స్టార్క్ బంతి గాడి తప్పి ఉంటే ఆస్ట్రేలియాకు వైట్ వాష్ తప్పేది కాదు. ఇక వెస్టిండీస్ హాట్ ఫేవరెట్ గా ఈ సిరీస్ విజయం ద్వారా ఎంతో ఉత్సాహంతో వరల్డ్ కప్ కి దిగుతుంది. ఆస్ట్రేలియా మాత్రం తమ పూర్వపు చైతన్యంతో ఆడకపోతే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కి అర్హత సాధించడం కూడా కష్టమే అవుతుంది.